నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:16

భారతీయుడు అడుగుపెట్టే వరకు జాబిల్లి యాత్రలు: ఇస్రో చీఫ్

అహ్మదాబాద్‌: అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్‌. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్ (Somanath) మరోసారి స్పందించారు..

భవిష్యత్తుల్లోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు (Lunar Missions) చేపడతామని చెప్పారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆస్ట్రోనాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ''చంద్రయాన్‌-3 (Chandrayaan 3) విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం.

ఇక, జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంతవరకు చంద్రయాన్‌ సిరీస్‌లను కొనసాగించాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికతలపై పట్టు సాధించాలి. అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలి. తదుపరి మిషన్‌లో దీన్ని ప్రయత్నిస్తాం'' అని వెల్లడించారు..

భారత్‌ త్వరలో చేపట్టబోయే గగన్‌యాన్‌ గురించి సోమనాథ్‌ మాట్లాడారు. ''దీనికంటే ముందు ఈ ఏడాది ఓ మానవరహిత మిషన్‌ను చేపట్టనున్నాం. ఏప్రిల్‌ 24న ఎయిర్‌డ్రాప్‌ వ్యవస్థను పరీక్షించనున్నాం. ఆ తర్వాత వచ్చే ఏడాది మరో రెండు మానవరహిత యాత్రలను చేపట్టబోతున్నాం. అన్నీ అనుకూలిస్తే 2025 చివరికి గగన్‌యాన్‌ ప్రయోగం చేపడతాం'' అని పేర్కొన్నారు..

గగన్‌యాన్‌ మిషన్‌ కోసం ఇప్పటికే నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లడానికి అనువైన CE20 క్రయోజనిక్‌ ఇంజిన్‌ను సిద్ధం చేసింది. ఈ ప్రయోగంతో వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులో భూకక్ష్యలోకి పంపుతారు. ఇందుకోసం ఎల్‌వీఎం-మార్క్‌3 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. దాదాపు 3 రోజుల తర్వాత భూమికి తిరిగొస్తారు. తిరుగు ప్రయాణంలో వ్యోమనౌక సముద్ర జలాల్లో ల్యాండ్‌ అవుతుంది..

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:14

మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు అరెస్టు

హైదరాబాద్‌: మాదాపూర్‌లో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.

ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన గుత్తులు శ్యామ్‌బాబు, కాటూరి సూర్యకుమార్‌లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.2 లక్షల విలువ చేసే 28 గ్రాముల ఎండీఎంఏ, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు..

బెంగళూరులోని కీలక నిందితుడు సోల్‌మెన్‌ నుంచి వీరు డ్రగ్స్‌ తీసుకొచ్చి.. రాజమహేంద్రవరంలో విద్యార్థులకు అధిక ధరకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

నిందితులిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుమారులని పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులకోసం బెంగళూరుకి వెళ్లి డ్రగ్స్‌ దందాలో దిగారని పేర్కొన్నారు. దర్యాప్తు నిమిత్తం డ్రగ్స్‌తో సహా నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు..

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:03

నేటి నుండి నామినేషన్ పర్వం ప్రారంభం

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఏప్రిల్ 18 నోటిఫికేషన్ వెలువడనుంది.

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థా నాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ గురువారం ఉదయం విడుదల కానుం డగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది.

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 25గా నిర్ణయించా రు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, 29 ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13న పోలింగ్ జరగనుండగా, జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

లోక్‌సభ ఎన్నికలలో తెలం గాణ, ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాల కు నాలుగో విడతలో ఎన్ని కలు జరగనున్నాయి. సర్వేలు బంద్ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్‌స్టాప్ పడనుంది.

ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నిక లకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు. ప్రీ -పోల్ సర్వే కానీ, ఒపీని యన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించ కూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించ డానికి ఎన్నికల సంఘం అనుమతించింది.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్..

ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు

ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన..

ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు..

మే 13న ఎన్నికలు..

జూన్ 4న ఓట్ల లెక్కింపు..

తెలంగాణలో 17 పార్ల మెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజక వర్గం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక.. జూన్ 4న ఓట్ల లెక్కింపు..

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:00

మహానగరంలో పలుచోట్ల వర్షం

భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరా బాద్ వాసులకు బుధవారం రాత్రి ఉపశమనం కలిగింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపో యింది.

హైదరాబాద్ లోని పలుచోట్ల బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తరువాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, అమీర్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

కుత్బుల్లాపూర్ లోని సూరా రం, చింతల్, నిజాంపేట్, సుచిత్ర, దుండిగల్, షాపూర్ నగర్ పలు ప్రాంతాలలో ఉరుములు తో కూడిన వర్షం కురిసింది.గత కొన్ని రోజులుగా భానుడి భగ భగల నుంచి ఇబ్బంది పడుతున్న నగర వాసులకు వర్షం కురవడంతో ఉపశమనం లభించింది.

దీంతో నగరంలో ఉష్ణోగ్ర తలు భారీగా పడిపోయా యి. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు...

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:19

నేడు DC,GT, ఢీ: ఢిల్లీకి కీలకం

ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీల కంగా మారింది. వరుస ఓటములతో సతమతమ వుతున్న డిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని తపిస్తుంది.

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరు లో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది.

బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.లక్నో తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. గుజరాత్‌ను కూడా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది.

అయితే స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో పోటీలో తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది.

మరో ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌లో ఉండడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతని పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వార్నర్‌తో కలిసి అతను శుభారంభం అందిస్తే జట్టు బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.

ఇక లక్నోపై యువ ఆటగా డు జాక్ ఫ్రెజర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడి లోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీం తో ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి జట్టు అలాం టి ప్రదర్శనే ఆశిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపిస్తున్నా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తు న్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా రాణిం చేందుకు సిద్ధమయ్యాడు. పంత్ తన మార్క్ బ్యాటిం గ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. ట్రిస్టన్ స్టబ్స్ కూడా నిలకడడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నాడు.

ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తు న్నాడు. షాయ్ హోప్ రూపంలో మరో హార్డ్ హిట్టర్ జట్టులో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాఛిన్నం చేసే సత్తా అతనికుంది. దీంతో హోప్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కుల్దీప్ యాదవ్, ఖలీల్, అక్షర్, ముకేశ్, ఇషాంత్ తదిత రులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు...

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:16

నేడు కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేరళకు వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో ఆయన పాల్గొనను న్నారు.

బుధవారం, గురువారం రెండు రోజుల పాటు సిఎం రేవంత్ కేరళలో పర్యటించ నున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేప థ్యంలోనే ఆయన బుధవా రం రేవంత్ హైదరాబాద్ నుంచి కేరళకు బయల్దేర తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

బుధవారం అలిప్పీ నియోజ కవర్గంలో గురువారం వయ నాడు, నియోజకవర్గంలో సిఎం రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. అలిప్పీ నియోజకవర్గం నుంచి ఏఐసిసి నాయకులు కెసి వేణుగోపాల్ పోటీ చేస్తుండగా వయనాడు నియోజకవర్గం నుంచి ఏఐసిసి అగ్రనేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెండు రోజుల పాటు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటించను న్నారు.

ఎపి, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ సిఎం ప్రచారం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చరిష్మాను తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో నూ ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అందులో భాగంగా పొరుగు రాష్ట్రాల్లోనూ ప్రచారానికి వెళ్లాలని ఆ పార్టీ అధినా యకత్వం సిఎం రేవంత్‌ను ఆదేశించింది.

ఈ మేరకు పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళ నాడు, కర్ణాటక, మహారా ష్ట్రల్లో, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పార్టీ అభ్య ర్థులకు మద్ధతుగా రేవంత్‌ రెడ్డి ప్రచారం నిర్వహించను న్నారు.

అధిష్ఠానం నిర్ణయం మేరకు మంగళవారం మహారాష్ట్ర లో రేవంత్‌రెడ్డి ప్రచారం చేయాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సిఎం రేవంత్ పర్యటన రద్దైంది... 18వ తేదీ రాత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరా బాదు చేరుకుంటారు.

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:13

మహిళలకు అధికారం అందని ద్రాక్షేనా❓️

దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ మహిళల ఓట్లపై ప్రధానంగా దృష్టి పెడు తుంది. ఇందు కోసం మహిళా సాధికారత, వారికి 33 శాతం రిజర్వేషన్లు, హక్కులువంటి అంశాలపై చుట్టూ రాజకీయాలు నడుపుతుంది.

కానీ, నిజ జీవితంలో మాత్రం అవేమీ కార్యరూపం దాల్చటం లేవు. ఇందుకు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గుజరాత్‌లోని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు మహిళలకు కేటాయించిన అతి తక్కువ సీట్లే ఇందుకు ప్రత్యక్ష నిద ర్శనం. ఈ రెండు పార్టీలు ఈ సారి నలుగురు చొప్పున మహిళలను లోక్‌సభ బరిలో నిలిపాయి.

ముఖ్యంగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించటం, అందుకు పార్లమెంటులో చట్టం చేయటం.. అన్నీ తమ కారణంగానే అని చెప్పుకునే బీజేపీ.. సాక్షా త్తూ ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలోనే వారికి మహిళ లకు సీట్లు కేటాయించటం లో విముఖతను చూపు తుండటం గమనార్హం.

ఈ సారి బీజేపీ నలుగురు, కాంగ్రెస్‌ నలుగురు మహిళ లను తమ పార్టీల నుంచి లోక్‌సభ ఎంపీ అభ్యర్థు లుగా పోటీలో ఉంచాయి. గుజరాత్‌లో దాదాపు 2.39 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం నమోదైన ఓటర్లలో 50 శాతం మంది వారే. అయినప్పటికీ చెప్పు కోదగిన సంఖ్యలో కూడా ప్రధాన పార్టీలు మహిళలకు లోక్‌సభ సీట్లను కేటాయిం చక పోవటాన్ని మేధావులు, స్త్రీ అభ్యుదయవాదులు తప్పు బడుతున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నుంచి ఆరుగురు మహిళా ఎంపీలు గెలిచారు. అయితే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ నలుగురికి మాత్రమే పరిమితం కావటాన్ని మహిళావాదులు వేలెత్తి చూపుతున్నారు. గుజరా త్‌లో మహిళా ఎంపీలు, అభ్యర్థుల ప్రాతినిధ్యం క్రమంగా క్షీణిస్తున్నది.

26 స్థానాలకు గానూ ప్రస్తుతం బీజేపీ నామినేట్‌ చేసిన నలుగురు మహిళ లలో జామ్‌నగర్‌ స్థానానికి పూనమ్‌ మేడమ్‌, సబర్‌ కాంతా స్థానానికి శోభనా బరయ్య, భావ్‌నగర్‌ స్థానానికి నీము బంభా నియా, బనాస్‌ కాంతా స్థానానికి రేఖా బెన్‌ చౌదరి ఉన్నారు.

ముఖ్యంగా, ఉత్తర గుజరా త్‌లోని బనస్కాంత స్థానాని కి బీజేపీ మహిళా అభ్యర్థిపై కాంగ్రెస్‌ మహిళ అభ్యర్థి పోటీ చేయనున్నారు. గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ రెండూ ఒకరిపై ఒకరు మహిళా అభ్యర్థులను నిలబెట్టిన ఏకైక సీటు ఇదే కావటం గమనార్హం.

ఇక కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదిం చిన నలుగురు మహిళా అభ్యర్థుల్లో జెనీ బెన్‌ ఠాకోర్‌ బనస్కాంత స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా పోటీ చేస్తున్న గాంధీనగర్‌ స్థానం నుంచి సోనాల్‌ పటేల్‌ను కాంగ్రెస్‌ పోటీకి దింపింది. మిగతా రెండు స్థానాలైన అమ్రేలిలో జెని తుమ్మర్‌, దాహౌద్‌లో ప్రభా తవియాడ్‌లు ఉన్నారు.

గుజరాత్‌లో అహ్మదాబాద్‌ వెస్ట్‌, గాంధీనగర్‌, పోర్‌ బందర్‌, పటాన్‌, పంచ మహల్‌, ఖేడా, బరూచ్‌, వల్సాద్‌, నవ్‌సారి స్థానాల్లో ఇప్పటివరకు ఏ పార్టీ నుంచి కూడా మహిళా అభ్యర్థి ఎన్నిక కాకపోవటం గమనార్హం.

రాజకీయ పార్టీలకు గెలుపు, అధికారం తప్పితే.. మహిళ లకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆసక్తి ఉండదని మేధావులు, విశ్లేషకులు అంటున్నారు. మహిళపై మరొక మహిళను నిలబెట్టటం, ఓడిపోయే స్థానాల్లోనూ మహిళనే బరిలో ఉంచి.. కంటి తుడుపు చర్యగా సీట్లను కేటాయిస్తున్నారని చెప్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:11

నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం :ప్రత్యేక ప్రసారానికి ఈసీ ఓకే

భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఏప్రిల్ 4న రాముడి కల్యా ణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఈసీ ఈ ఆంక్షలు విధించింది.

అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

నాలుగు దశాబ్దాలుగా రాముల‌వారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.

ఈసీ నిర్ణయంపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలకు దేవుడికి సంబంధం లేదని పేర్కొన్నాయి. దీనిపై స్పం దించిన ఎన్నికల సంఘం ఈరోజు జరగబోయే సీతారాముని కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసి అనుమతి ఇచ్చింది.

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:10

ఒంటరి పోరాటంతో R R కి,విజయాన్ని అందించిన జోస్ బట్లర్

కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌క‌తా నైట్‌రై డర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్ రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది.

అంతా ఓడిపోతుంది.. కోల్‌కతా పేసర్ల ధాటికి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్లు వ‌రుస పెట్టి పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్న సమయంలో బట్లర్ జోష్ పెంచాడు..

నిలకడగా ఆడుతూ దంచికొట్టాడు. దీంతో ఈ ఉత్కంఠ పోరులో 2 వికెట్ల తేడాతో విజయం సాధిం చింది. ఈ విజయంతో రాజస్థాన్ జట్టు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

234 పరుగుల భారీ ఛేద నలో రాజస్థాన్ టాపార్డర్ విఫ‌ల‌మైన‌ వేల… జోస్ బట్లర్ వీరోచితంగా పోరా డాడు. 60 బంతుల్లో 107 పరుగులతో చెలరేగి పోయాడు.

ఇక‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19), కెప్టెన్ సంజూ శాంసన్ (12) పరుగులకే పెవిలియన్ చేరగా.. రియాన్ పరాగ్ (34) పరుగుల వద్ద ఔటయ్యాడు. రోవ్‌మన్ పావెల్ జట్టుకు పరుగులు (26) జోడించి అతను కూడా ఔట య్యాడు.

ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఒక్క వికెట్ దక్కించుకున్నాడు..

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:08

Bhadradri: శ్రీరాముని కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి

Bhadradri: శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శ్రీరామనవమి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రామాలయానికి విద్యుత్‌ దీపాలంకరణలు, చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, బాపు రమణీయ చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి..

స్వాగత ద్వారాలు భక్తరామదాసు కీర్తనలతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు.

కల్యాణోత్సవంలో భాగంగా జరిగే... ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసుశాఖ 1800 మందికి పైగా సిబ్బందితొ బందోబస్తు ఏర్పాటు చేసింది.

శ్రీరామనవమి ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఐటీడీఏ పీవో, దేవస్ధానం ఈవో రమాదేవిలు పరిశీలించారు. వీవీఐపీ సెక్టార్‌లతో పాటు ఇతర సెక్టార్లలో చేపట్టాల్సిన మార్పుల గురించి స్ధానిక అధికారులకు సూచనలు చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లలో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.